ఆవులతో ర్యాలీ చేపట్టిన నాగర్ కర్నూల్ రైతులు-వీడియో

ఆవులతో ర్యాలీ చేపట్టిన నాగర్ కర్నూల్ రైతులు

Update: 2020-11-04 12:13 GMT

    నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో రైతులు రోడెక్కారు. తమ మూగ జీవాలను మేపేందుకు అటవీ శాఖాధికారులు ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు నిరసన చేపట్టారు. అమ్రాబాద్ మండలం మన్ననూర్ అటవీశాక చెక్‌పోస్ట్‌ వద్ద వందలాది పశువులతో రైతులు ధర్నా చేపట్టారు. దీంతో శ్రీశైలం- హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటవీ శాఖ అధికారులు వచ్చి రైతులకు నచ్చచెప్పి ధర్నాను విరమించారు.

Full View


Tags:    

Similar News