ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు

Update: 2020-09-12 05:26 GMT

ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. కూసుమంచి మండలం నాటకన్‌ గూడెంలో బస్సు అదుపుతప్పి శనివారం తెల్లవారుజామున రహదారి పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ప్రైవేటు బస్సు ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇంట్లో నిద్రిస్తున్న కృష్ణారెడ్డి, ఆయన సతీమణి వెంకటమ్మ స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

Full View




Tags:    

Similar News