విషాదం: ఈత కొడుతుండగా విద్యుత్ షాక్‌‌తో యువకుడి మృతి

Update: 2020-08-31 10:49 GMT

కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో ఈత సరదా విషాదాన్ని మిగిల్చింది. కళ్ల ముందే ఈత కొడుతోన్న యువకుడు విద్యుత్ షాక్‌కు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బొమ్మెపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గురుప్రసాద్ అనే యువకుడు ఈత కోసం బావిలో దూకాడు. అంతలోనే బావిలోని మోటార్‌ పైపుకు అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావటంతో గురుప్రసాద్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు.

Full View




Tags:    

Similar News