Warangal: ఘట్కేసర్ సమీపంలో వరంగల్ దంపతుల రైలు కింద పడి ఆత్మహత్య
Warangal: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ వద్ద రైలు కింద పడి వరంగల్ జిల్లా చెన్నారావుపేట దంపతుల ఆత్మహత్య. పాపయ్యపేట గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు.
Warangal: ఘట్కేసర్ సమీపంలో వరంగల్ దంపతుల రైలు కింద పడి ఆత్మహత్య
వరంగల్: వరంగల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన దంపతులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సమీపంలో జరిగింది. స్థానికుల ప్రకారం.. పాపయ్య పేట గ్రామానికి చెందిన రవికుమార్, శిరీష దంపతులు గురువారం రాత్రి రైలు కిందపడి చనిపోయారు.
వీరి మరణ వార్త తెలియడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఘటనపై రైల్వే పోలీసులు పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.