Big Debate: రాజకీయాల్లో మాఫియా రాజ్యం.. మాజీ హోం సెక్రటరీ సంచలన వ్యాఖ్యలు

Big Debate: రాజకీయాల్లో క్రిమినలైజేషన్ పెరిగిపోతోందని, చాలామంది ముఖ్యమంత్రులపై ఉన్న కేసులు వారు పదవి చేపట్టకముందు అపోజిషన్‌లో ఉన్నప్పుడు నమోదైనవేనని కేంద్ర మాజీ హోంశాఖ కార్యదర్శి కె. పద్మనాభయ్య విశ్లేషించారు.

Update: 2026-08-20 06:37 GMT

Big Debate: రాజకీయాల్లో మాఫియా రాజ్యం.. మాజీ హోం సెక్రటరీ సంచలన వ్యాఖ్యలు

Big Debate: రాజకీయాల్లో పెరిగిపోతున్న ఖర్చులు, మాఫియాల జోక్యం మరియు క్రిమినలైజేషన్ అంశాలపై కేంద్ర మాజీ హోంశాఖ కార్యదర్శి కె. పద్మనాభయ్య సంచలన విశ్లేషణ చేశారు. హెచ్‌ఎమ్‌టీవీ నిర్వహించిన ‘బిగ్ డిబేట్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఎన్నికల వ్యవస్థలో మరియు రాజకీయనాయకులపై నమోదవుతున్న కేసుల వెనుక ఉన్న అసలు కారణాలను వెల్లడించారు.

ప్రస్తుత రాజకీయాల్లో ఎన్నికలు విపరీతమైన ఖర్చుతో కూడుకున్నవిగా మారాయని పద్మనాభయ్య అభిప్రాయపడ్డారు. ఎంపీ ఎన్నికలకు దాదాపు ₹100 కోట్లు, ఎమ్మెల్యే ఎన్నికలకు ₹10 కోట్ల నుంచి ₹20 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ భారీ మొత్తం ఎక్కడి నుండి వస్తుందో, మళ్లీ దాన్ని ఎలా రాబట్టుకుంటారో అందరికీ తెలిసిన విషయమేనన్నారు. బొగ్గు, లిక్కర్, ఇసుక, పెట్రోల్-డీజిల్, బిల్డర్స్ మరియు ల్యాండ్ మాఫియాలకు పొలిటికల్ సపోర్ట్ లేకుండా ఇవి సాధ్యపడవని, రాజకీయ నాయకుల్లో నిజమైన మార్పు వస్తే తప్ప ఈ విధానం మారదని స్పష్టం చేశారు.

Full View

Tags:    

Similar News