Rohit Sharma: క్రికెట్ చరిత్రలో రోహిత్ అరుదైన మైలురాయి.. ఇక మరెవరికీ సాధ్యం కాదేమో!

Rohit Sharma created history: భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన మైలురాయి అందుకున్నాడు.

Update: 2026-06-22 12:26 GMT

Rohit Sharma: క్రికెట్ చరిత్రలో రోహిత్ అరుదైన మైలురాయి.. ఇక మరెవరికీ సాధ్యం కాదేమో!

Rohit Sharma: టీమిండియా ఓపెనర్, భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన మైలురాయి అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత ఓపెనర్లలో మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అఫ్గానిస్థాన్‌తో చెన్నైలో జరిగిన మూడో వన్డేలో 69 బంతుల్లో 79 పరుగులు చేయడంతో హిట్‌మ్యాన్ ఖాతాలో ఈ రేర్ రికార్డు చేరింది.

ఈ క్రమంలో మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను రోహిత్ అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఓపెనర్‌గా రోహిత్ ఖాతాలో 16,137 అంతర్జాతీయ పరుగులు ఉన్నాయి. సెహ్వాగ్ 16,119 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్ (15,335), సునీల్ గవాస్కర్ (12,258).. గబ్బర్ శిఖర్ ధావన్ (10,867) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో అర్ధశతకం సాధించిన రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను కూడా అందుకున్నాడు. వన్డేల్లో భారత ఆటగాళ్లలో అర్ధశతకం సాధించిన అత్యంత పెద్ద వయస్కుడిగా నిలిచాడు. 39 ఏళ్ల 51 రోజుల వయసులో వన్డేల్లో అర్ధశతకం సాధించాడు.

ఇంతకుముందు ఈ రికార్డు మాజీ ప్లేయర్ మొహిందర్ అమర్‌నాథ్ పేరిట ఉండేది. ఆయన 1989లో పాకిస్థాన్‌పై 39 ఏళ్ల 21 రోజుల వయసులో 88 పరుగులు చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును రోహిత్ అధిగమించాడు. ఓపెనర్లలో మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేయడం ఇప్పటి ఆటగాళ్లకు సాధ్యం కాకపోవచ్చు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. అఫ్గానిస్థాన్‌ను భారత బౌలర్లు 218 పరుగులకే కట్టడి చేశారు. స్టార్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేసి 23 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు. అయితే ఒక దశలో 36/4తో కష్టాల్లో పడిన అఫ్గానిస్థాన్‌ను కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ ఆదుకున్నాడు. అతడు 131 బంతుల్లో 102 పరుగులు చేసి తన తొలి వన్డే శతకాన్ని నమోదు చేశాడు.

అజ్మతుల్లా ఒమర్జాయ్ (50) కూడా అర్ధశతకంతో రాణించాడు. ఛేదనలో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ (86 బంతుల్లో 110*) ధాటికి అఫ్గాన్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఈ విజయంతో భారత్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడమే కాకుండా.. రోహిత్ మరోసారి తన క్లాస్ నిరూపించాడు. వయసు కేవలం సంఖ్య మాత్రమేనని చాటుతూ హిట్‌మ్యాన్ ఇంకా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టేలా కనిపిస్తున్నాడు.

ఇటీవలి కాలంలో రోహిత్ శర్మ మంచి ఫామ్ మీదున్నాడు. 2026 ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత జట్టును హిట్‌మ్యాన్ ముందుండి నడిపించాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సిరీస్‌ల్లో మంచి స్కోర్లు చేశాడు. అఫ్గానిస్థాన్‌ సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో 79 రన్స్‌ సాధించాడు. అయితే వన్డే ప్రపంచకప్‌ 2027 సమీపిస్తున్న కొద్దీ రోహిత్‌ భవితవ్యంపై చర్చ తీవ్రం అవుతోంది. హిట్‌మ్యాన్ ఆడుతాడో లేదో అని ఫాన్స్ కంగారు పడుతున్నారు. బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. వన్డే ప్రపంచకప్‌ గెలవడం రోహిత్ కల అన్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News