Delivery Boy Viral Video : జాంబీ డ్ర*గ్ కలకలం.. నడిరోడ్డు మీద విగ్రహంలా మారిపోయిన డెలివరీ బాయ్
Delivery Boy Viral Video : చండీగఢ్లో డెలివరీ బాయ్ రోడ్డుపై కదలకుండా నిలబడటం జాంబీ డ్రగ్ కలకలానికి దారితీసింది.
Chandigarh Zombie Delivery Boy
Delivery Boy Viral Video : చండీగఢ్ వీధుల్లో చోటుచేసుకున్న ఒక వింత సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఒక డెలివరీ బాయ్ రోడ్డుపై ఏకంగా రెండు గంటల పాటు విగ్రహంలా కదలకుండా నిలబడిపోవడం చూసి జనం హడలిపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, భారత్లోకి ప్రమాదకరమైన జాంబీ డ్ర*గ్ ప్రవేశించిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ డ్ర*గ్ కథాకమీమామిషు ఏంటో వివరంగా చూద్దాం.
ఏం జరిగింది? ఆ వీడియోలో ఏముంది?
మార్చి 24, 2026న చండీగఢ్లోని సెక్టార్ 33బి లో ఈ ఘటన వెలుగుచూసింది. ఒక యువ డెలివరీ బాయ్ రోడ్డు పక్కన తన బ్యాగ్తో సహా నిలబడిపోయాడు. నోట్లో బీడీ ఉంది కానీ దాన్ని కాల్చడం లేదు, కళ్లలో ఎలాంటి కదలిక లేదు. చుట్టుపక్కల ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా, దాదాపు రెండు గంటల పాటు అలా ఒకే భంగిమలో విగ్రహంలా ఉండిపోయాడు. స్థానికులు అతడిని పలకరించినా ఎలాంటి స్పందన లేదు. చివరకు భయపడిన జనం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి అతడిని ఆసుపత్రికి తరలించారు.
ఏమిటీ జాంబీ డ్ర*గ్ ?
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇది ఖచ్చితంగా జైలాజైన్ (Xylazine) లేదా ఫెంటానిల్ (Fentanyl) వంటి ప్రమాదకరమైన డ్ర*గ్స్ ప్రభావమేనని వాదిస్తున్నారు. అమెరికా, యూరప్ దేశాల్లో దీన్ని జాంబీ డ్ర*గ్ లేదా ట్రాంక్ డోప్ అని పిలుస్తారు. దీన్ని తీసుకున్న వారు స్పృహలో ఉన్నట్లు కనిపిస్తారు కానీ, మెదడు పనితీరు పూర్తిగా స్తంభించిపోతుంది. దీనివల్ల వారు గంటల తరబడి వింత వింత భంగిమల్లో కదలకుండా ఉండిపోతారు. న్యూయార్క్ వీధుల్లో ఇలాంటి దృశ్యాలు తరచుగా కనిపిస్తుంటాయి, ఇప్పుడు చండీగఢ్ ఘటన కూడా దానికి దగ్గరగా ఉండటంతో ఆందోళన పెరుగుతోంది.
What is happening here?
— Woke Eminent (@WokePandemic) March 25, 2026
A disturbing incident in Chandigarh’s Sector 33B has left residents alarmed after a Blinkit delivery worker was seen standing completely still for nearly two hours. Eyewitnesses reported that the man appeared unresponsive, staring blankly in one… pic.twitter.com/19aeXDVVmQ
నిపుణులు ఏమంటున్నారు ?
ఎక్స్ (X) ప్లాట్ఫామ్లో గైడ్ చేసే గ్రోక్ అనే ఏఐ బాట్ కూడా ఈ లక్షణాలు జైలాజైన్ డ్ర*గ్కు సరిపోతాయని పేర్కొంది. ఈ డ్ర*గ్ తీసుకుంటే రక్తపోటు, హృదయ స్పందన రేటు పడిపోయి మనిషి పూర్తిగా మొద్దుబారిపోతాడు. అయితే, చండీగఢ్ పోలీసులు మాత్రం దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఆ యువకుడి రక్త నమూనాలను పరీక్షించిన తర్వాతే అతను ఏదైనా మత్తు పదార్థం తీసుకున్నాడా లేక ఏదైనా మానసిక సమస్యతో అలా ప్రవర్తించాడా అనేది తెలుస్తుంది.
భారత్కు పొంచి ఉన్న ముప్పు
ఒకవేళ ఇది నిజంగానే డ్ర*గ్స్ ప్రభావమే అయితే, భారతీయ యువతపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సింథటిక్ డ్ర*గ్స్ చాలా తక్కువ ధరకు లభిస్తాయి మరియు ప్రాణాంతకమైనవి. అధికారులు వెంటనే స్పందించి ఈ వీడియో వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించాలని, ఒకవేళ డ్ర*గ్స్ సరఫరా జరుగుతుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చండీగఢ్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా డ్ర*గ్స్ మాఫియాపై చర్చకు దారితీసింది.