Nalgonda: నల్లగొండలో విగ్రహాల తొలగింపు యత్నంపై తీవ్ర నిరసన
Nalgonda: నల్లగొండ మర్రిగూడెం బైపాస్లోని బుద్ధవనంలో విగ్రహాల తొలగింపు కుట్రను అడ్డుకున్న కేవీపీఎస్, సామాజిక సంఘాల నాయకులు. ఘటనా స్థలంలో ఆందోళన.
Nalgonda: నల్లగొండలో విగ్రహాల తొలగింపు యత్నంపై తీవ్ర నిరసన
నల్లగొండ: నల్లగొండ పురపాలక సంఘం పరిధిలోని మర్రిగూడెం బైపాస్ జంక్షన్లోని బుద్ధవనంలో ఉన్న బాబాసాహెబ్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్రామ్, బుద్ధుడి విగ్రహాలను తొలగించేందుకు కుట్ర జరుగుతోందంటూ కేవీపీఎస్, వివిధ సామాజిక సంఘాల నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకున్న నాయకులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. విగ్రహాలకు ఎలాంటి హాని తలపెట్టినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేస్తూ అక్కడ ఆందోళన చేపట్టారు.