Sircilla: పోలీసులకు సేవా పతకాలు ప్రదానం – అభినందించిన విప్

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విశేష సేవలు అందించిన పోలీసు అధికారులకు 80వ స్వాతంత్ర వేడుకల్లో సేవా పతకాలు అందజేత. అభినందించిన ప్రముఖులు.

Update: 2026-08-15 12:12 GMT

Sircilla: పోలీసులకు సేవా పతకాలు ప్రదానం – అభినందించిన విప్

సిరిసిల్ల: పోలీస్ శాఖలో విధి నిర్వహణలో విశేష సేవలు అందించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పోలీస్ సేవా పతకాలను అందజేశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్ పతకాలను అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అంకితభావంతో, కష్టపడి పనిచేసే పోలీస్ అధికారులు, సిబ్బందికి వారి సేవలకు తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. పోలీస్ శాఖలో విశేష సేవలు అందించి ప్రతిష్టాత్మక పోలీస్ సేవా పతకాలకు ఎంపికైన అధికారులను అభినందించారు.

సేవా పతకాలకు ఎంపికైన అధికారులు

రాజేందర్, హెడ్ కానిస్టేబుల్, ముస్తాబాద్ పోలీస్ స్టేషన్‌కు ఉత్తమ సేవా పతకం లభించింది. నాగేశ్వరరావు, కమ్యూనికేషన్ ఎస్‌ఐ, సేవా పతకానికి ఎంపికయ్యారు. భూక్య లత, హెడ్ కానిస్టేబుల్, ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్, సేవా పతకానికి ఎంపికయ్యారు. శ్రీనివాస్, బోయినపల్లి పోలీస్ స్టేషన్, సేవా పతకానికి ఎంపికయ్యారు.

విధి నిర్వహణలో అంకితభావంతో సేవలందించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి పతకాలు అందజేయడం ద్వారా వారి సేవలకు గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా పతకాలు అందుకున్న అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు.

Tags:    

Similar News