Nacharam: గౌడెల్లి రామకృష్ణ అంత్యక్రియలు.. హాజరైన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

Nacharam: నాచారం స్థానిక నేత గౌడెల్లి రామకృష్ణ అంత్యక్రియల్లో బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.ఎస్. ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.

Update: 2026-08-19 14:49 GMT

Nacharam: గౌడెల్లి రామకృష్ణ అంత్యక్రియలు.. హాజరైన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

నాచారం: స్థానిక నాయకుడు గౌడెల్లి రామకృష్ణ మృతి పట్ల బీఆర్‌ఎస్‌ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం నిర్వహించిన రామకృష్ణ అంత్యక్రియల్లో ఆయన పాల్గొని, పార్థివదేహానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రామకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రామకృష్ణతో తనకు ఉన్న పరిచయం, ఆయన స్థానికంగా చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ఆయన మృతి స్థానికంగా తీరని లోటని పేర్కొన్నారు.

అంత్యక్రియలకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై రామకృష్ణకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో కేశవ్, ఎరుపుల నాగరాజు, యేముల హరిబాబు, శ్రీనివాస్‌రెడ్డి, నూతలకంటి రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News