Madanapalle: సెప్టెంబర్ 2న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
Madanapalle: మదనపల్లెలో సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.
Madanapalle: సెప్టెంబర్ 2న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
మదనపల్లె: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 2వ తేదీన మదనపల్లెలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు రాయలసీమ కో-కన్వీనర్, మదనపల్లె నియోజకవర్గ ఇన్చార్జ్ గంగారపు రాందాస్ చౌదరి తెలిపారు.
ఆయన అధ్యక్షతన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, మెగా అభిమానుల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకల్లో భాగంగా ఉదయం 9 గంటలకు మిషన్ కాంపౌండ్ నుంచి భారీ బైక్ ర్యాలీ ప్రారంభమై చిత్తూరు బస్టాండ్, టౌన్ బ్యాంక్ సర్కిల్, బెంగళూరు బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్, నీరుగట్టువారిపల్లె మీదుగా శ్రీదేవి గార్డెన్ వరకు కొనసాగనుంది.
బైక్ ర్యాలీలో పాల్గొనే వారు ఉదయం 8.30 గంటలకే మిషన్ కాంపౌండ్ వద్దకు చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు. అనంతరం ఉదయం 11 గంటలకు శ్రీదేవి గార్డెన్లో పవన్ కళ్యాణ్ పాల్గొనే లైవ్ కార్యక్రమాన్ని ఎల్ఈడీ స్క్రీన్పై ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా యువజన విభాగానికి సంబంధించిన ప్రకటన, పవన్ కళ్యాణ్ సందేశం, ఇతర ఆనంద క్షణాలను పార్టీ శ్రేణులు, అభిమానులు కలిసి వీక్షించనున్నారు.
ఈ కార్యక్రమాల్లో మదనపల్లె ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ రాయల్, టౌన్ ప్రెసిడెంట్ నాయని జగదీష్, టౌన్ ఉపాధ్యక్షులు పురం నగేష్, కొలిమి ప్రసాద్, మదనపల్లె రూరల్ అధ్యక్షులు రోణూరు బాబు, ఉపాధ్యక్షులు సువరపు చంద్రశేఖర్, కుమార్, నిమ్మనపల్లి మండల అధ్యక్షులు ప్రదీప్ సింగ్, ఉపాధ్యక్షులు హర్షవర్ధన్, అఫ్రోజ్ ఖాన్, రామసముద్రం మండల అధ్యక్షులు హోసూరు చంద్రశేఖర్, మదనపల్లె సీనియర్ నాయకులు తోట కళ్యాణ్,
చేనేత విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, బీసీ నాయకులు బండి మనోహర్, ఉపాధ్యక్షులు చాకలి విశ్వనాథ్, గడ్డం లక్ష్మీపతి, ఉమ్మడి చిత్తూరు జిల్లా జాయింట్ సెక్రెటరీ సనా ఉల్లా, గజ్జల రెడ్డప్ప, సివిల్ సప్లై డైరెక్టర్ వై.ఎస్. మునిరత్నం, వీర మహిళలు పద్మావతి, మల్లిక, నాగవేణి తదితరులు పాల్గొననున్నారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.