Gold Price Today: పసిడి కొనుగోలుదారులకు ఊరట.. నేడు బంగారం, వెండి రేట్లు ఇవే
Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో ఆగస్ట్ 16న బంగారం ధరలలో ఎటువంటి హెచ్చుతగ్గులు నమోదు కాలేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు చెన్నై, ముంబై, బెంగళూరు నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Gold Price Today
Gold Price Today: పసిడి కొనుగోలుదారులకు ఆగస్ట్ 16న కాస్త ఊరట లభించింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా శనివారం నాటి రేట్లే కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పసిడి ధరలు ప్రశాంతంగా ఉండటంతో కొనుగోలుదారులు శనివారం రేట్లలోనే ఆభరణాలను కొనుగోలు చేసే వెసులుబాటు లభించింది.
తులం బంగారం ధరలు నగరాల్లో ఇలా..
మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం గ్రాము ధర రూ.15,513 వద్ద ఉంటే, తులం (10 గ్రాములు) ధర రూ.1,55,130గా నమోదైంది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,220గా ఉంటే, తులం ధర రూ.1,42,200 వద్ద విక్రయమవుతోంది. 18 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.11,635 వద్ద కొనసాగుతుండగా, తులం ధర రూ.1,16,350 వద్ద నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన వ్యాపార కేంద్రాలన్నింట్లోనూ ఈ ధరలే అమలులో ఉన్నాయి.
రాకెట్ వేగంతో ఉన్న వెండి కిలో రేటు ఎంతంటే?
బంగారంతో సమానంగా పరుగులు తీస్తున్న వెండి రేట్లు కూడా శనివారం స్థాయట్లోనే స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో గ్రాము వెండి ధర రూ.250 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల వెండి ధర రూ.2,500 కాగా, కిలో వెండి రేటు రూ.2,50,000 వద్ద ఉంది. అయితే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై ప్రాంతాల్లో స్థానిక పన్నుల కారణంగా కిలో వెండి ధర రూ.2,55,000 వద్ద విక్రయమవుతోంది. ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో రేటు రూ.2,50,000గా నమోదు కావడం గమనార్హం.
కొనుగోలుదారులు గమనించాల్సిన విషయాలు
ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్ సగటు ధరలు మాత్రమే. వినియోగదారులు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు ఆయా జ్యువెలరీ షోరూమ్లలో విధించే మేకింగ్ ఛార్జెస్, తరుగు, 3 శాతం జీఎస్టీ అదనంగా చేరతాయని గుర్తుంచుకోవాలి. కాబట్టి కొనుగోలుకు వెళ్లే ముందు షోరూమ్లో తుది బిల్లు రేటును సరి చూసుకోవడం మంచిది.