Gold Price Today : బంగారం కొనాలనుకునే వారికి బిగ్ రిలీఫ్.. భారీగా దిగొచ్చిన పసిడి, వెండి ధరలు
Gold Price Today : గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధరలు.. నేడు (మే 28న) పసిడి ప్రేమికులకు కాస్త ఊరటనిచ్చాయి.
Gold Price Today
Gold Price Today : అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన పరిణామాల ప్రభావం దేశీయంగా బంగారం, వెండి ధరలపై గట్టిగానే పడుతోంది. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధరలు.. నేడు (మే 28న) పసిడి ప్రేమికులకు కాస్త ఊరటనిచ్చాయి. గ్లోబల్ మార్కెట్ ఒడిదొడుకులు, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మారకం వంటి కారణాల వల్ల బుధవారం భారీగా పతనమైన పసిడి రేట్లు.. ఈరోజు కూడా స్థిరంగా కొనసాగుతూ సామాన్యులకు ఊరట కలిగిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే బంగారం ఏకంగా 70 శాతం, వెండి ఏకంగా 150 శాతం వరకు పెరిగి రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్ వేళ రేట్లు స్వల్పంగా తగ్గడం నగల ప్రియులకు పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో నేటి పసిడి ధరల వివరాలు పరిశీలిస్తే.. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల (916 స్వచ్ఛత) బంగారం ఒక గ్రాము ధర రూ.14,510 వద్ద పలుకుతోంది. దీని ప్రకారం చూస్తే పది గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,45,100 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే తులంపై రూ.550 వరకు తగ్గడం గమనార్హం. ఇక అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల (బిస్కెట్ గోల్డ్) బంగారం విషయానికి వస్తే.. నేడు ఒక గ్రాము ధర రూ.15,829 గా నమోదు కాగా, 10 గ్రాముల (తులం) ధర రూ.1,58,290 వద్ద స్థిరంగా సాగుతోంది. అలాగే సాధారణ ఆభరణాల కోసం వాడే 18 క్యారెట్ల బంగారం ధర తులం రూ.1,18,720 వద్ద విక్రయించబడుతోంది.
బంగారంతో పాటు వెండి కొనాలనుకునే వారికి కూడా ఈరోజు మంచి రోజనే చెప్పాలి. దేశీయంగా వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఒక గ్రాము వెండి ధర రూ.284.90 పైసలుగా ఉంది. దీని ప్రకారం మార్కెట్లో ఒక కిలో వెండి ధర రూ.2,84,900 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే కిలో వెండిపై సుమారు రూ.వంద వరకు తగ్గింది. అయితే స్థానిక పన్నులు, అదనపు ఛార్జీల కారణంగా హైదరాబాద్ నగరంలో కిలో వెండి ధర రూ.2,89,900 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ వంటి అన్ని ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు అమల్లో ఉన్నాయి. ఇతర మెట్రో నగరాలైన చెన్నైలో కిలో వెండి రూ.2,89,900, బెంగళూరులో రూ.2,85,100 మరియు కోల్కతాలో రూ.2,84,900 వద్ద కొనసాగుతోంది.
సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగితే దేశీయంగానూ రేట్లు పెరుగుతాయి. ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల రేసు, ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి వల్ల పసిడి ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగాయి. వీటికి తోడు స్థానిక జ్యువెలరీ షాపుల్లో వసూలు చేసే మేకింగ్ ఛార్జీలు, వేస్టేజ్, 3 శాతం జీఎస్టీ అదనం అవుతాయని కొనుగోలుదారులు గమనించాలి. అందువల్ల మీరు నగలు కొనేముందు మీ ఊరిలోని లైవ్ మార్కెట్ ధరలను, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్మార్క్ ముద్రను ఒకసారి ఖచ్చితంగా తనిఖీ చేసుకోవడం మంచిది.