కొత్త పార్టీ ఏర్పాటుపై దూకుడు పెంచిన షర్మిల

Update: 2021-02-17 12:05 GMT

కొత్త పార్టీ ఏర్పాటుపై దూకుడు పెంచిన షర్మిల

కొత్త పార్టీ వ్యవహారంలో వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. కొత్త పార్టీకి సలహాదారులుగా మాజీ ఐఏఎస్ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఐపీఎస్‌ ఉదయ సిన్హాలు నియామితులయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉదయసిన్హా సీఎస్‌వోగా పనిచేస్తే.. సీఎంవోలో అడిషనల్‌ సెక్రటరీగా ప్రభాకర్‌రెడ్డి పనిచేశారు. ఇవాళ ఉదయం నుంచే తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలతో పాటు సంఘాల నేతలు, మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌లు సైతం లోటస్ పాండ్‌లో షర్మిలను కలిశారు.

Tags:    

Similar News