Hyderabad: టీవీ ఛానల్ యాంకర్ను కిడ్నాప్ చేసిన యువతి
Hyderabad: హైదరాబాద్లో ఓ యాంకర్ కిడ్నాప్ కలకలం రేపింది.
Hyderabad: హైదరాబాద్లో ఓ యాంకర్ కిడ్నాప్ కలకలం రేపింది. ఓ ఎంటర్టైన్మెంట్ చానల్లో పనిచేస్తున్న ప్రణవ్ అనే వ్యక్తిని ట్రాప్ చేసి త్రిష్ణ అనే యువతి కిడ్నాప్ చేసింది. ఓ మ్యాట్రిమొనిలో ప్రణవ్ ఫొటో చూసి త్రిష్ణ ఇష్టపడింది. అది ఫేక్ ఐడీ అని తెలుసుకుని.... ఇన్స్ట్రా గ్రాంలో ప్రణవ్తో పరిచయం చేసుకుని మ్యాట్రిమొని విషయాన్ని తెలిపింది. ఆ తర్వాత కూడా ప్రణవ్తో మాట్లాడుతూ పెళ్లి చేసుకోవాలని బెదిరింపులుక పాల్పడేది. పెళ్లికి ప్రణవ్ నిరాకరించడంతో నలుగురు వ్యక్తులతో కలిసి కిడ్నాప్ చేయించింది. కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకుని... ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రణవ్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు త్రిష్ణను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.