నకిలీ హెల్మెట్‌లు విక్రయిస్తున్న వారిపై చర్యలు : సీపీ సజ్జనార్‌

Update: 2019-11-25 07:50 GMT
సీపీ సజ్జనార్‌

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో బ్రాండెడ్‌ హెల్మెట్ల వాడకంపై అవగాహన కల్పించారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో పోలీసులు స్పెషల్‌ డ్రైవ్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల ప్రమాదాలపై సైబరాబాద్‌ పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టారు.

హైదరాబాద్‌లో నకిలీ ISI మార్క్‌తో ఉన్న హెల్మెట్లను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నకిలీ హెల్మెట్‌ అమ్మకాలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. భారీగా నకిలీ హెల్మెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర ప్రమాదాల్లో 94 శాతం మంది హెల్మెట్‌ సరిగ్గా లేకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు సీపీ సజ్జనార్‌. వాహనదారులు నాణ్యత కలిగిన హెల్మెట్లు ధరించి ప్రమాదాల నుంచి బయటపడాలని కోరారు.

Tags:    

Similar News