హరీష్‌రావు వ్యాఖ్యలపై విజయశాంతి ఫైర్‌

దుబ్బాకలో బీజేపీ, కాంగ్రెస్‌‌కు డిపాజిట్లు రావన్న హరీష్ ‌కామెంట్స్‌పై విజయశాంతి మండిపడ్డారు. హరీష్ వ్యాఖ్యలు అనుమానాలకు తావిస్తున్నాయన్నారు.

Update: 2020-10-28 14:30 GMT

దుబ్బాకలో బీజేపీ, కాంగ్రెస్‌‌కు డిపాజిట్లు రావన్న హరీష్ ‌కామెంట్స్‌పై విజయశాంతి మండిపడ్డారు. హరీష్ వ్యాఖ్యలు అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. దుబ్బాక ఫలితాన్ని టీఆర్ఎస్‌ ముందే నిర్ణయించిందా? అంటూ విజయశాంతి ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్‌‌కు డిపాజిట్లు రావని హరీష్ ఎలా అంటారన్న విజయశాంతి.... టీఆర్ఎస్‌ అరాచకాలపై మాత్రం దుబ్బాక ఓటర్లకు స్పష్టత వచ్చిందన్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఈవీఎంలను పెడతారా? ఓట్లను కూడా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోనే లెక్కిస్తారా? అంటూ విజయశాంతి సెటైర్లు వేశారు.

దుబ్బాక ఉప ఎన్నికలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలకు డిపాజిట్ కూడా రాదని ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. దీన్ని బట్టి ఎన్నికలకు ముందే ఫలితాలు ఏ విధంగా ఉండాలో టిఆర్ఎస్ పార్టీ నిర్ణయించే స్థాయికి వెళ్లి పోయిందంటే అధికార పార్టీ అరాచకాలపై దుబ్బాక ఓటర్లకు స్పష్టత వచ్చి ఉంటుంది. హరీష్ రావు కామెంట్ చూస్తూ ఉంటే... దుబ్బాక లో పోలింగ్ జరిగిన తర్వాత... కెసిఆర్ గారి ఫామ్ హౌస్ లో ఈవీఎం మిషన్లను పెట్టి, ఓట్లను లెక్కిస్తారో ఏమో..అనే అనుమానం కలుగుతోందని ఆమె అన్నారు. 

Tags:    

Similar News