ఎర్రమంజిల్లో కొత్త అసెంబ్లీ భవన సముదాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని కాంగ్రెస్ నేత వీహెచ్ పరిశీలించారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను వదిలేసి కొత్త అసెంబ్లీ, కొత్త సచివాలయం అంటూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని కేసీఆర్పై వీహెచ్ మండిపడ్డారు. వేలకోట్ల విలువైన భవనాలను కూల్చివేస్తామంటూ కేసీఆర్, నయా నిజాంలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు ఎర్రమంజిల్ అంటోన్న కేసీఆర్ ఆ తర్వాత చార్మినార్ను కూల్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు.