‌Hyderabad: మణికొండలో అరుణ మెడికల్‌ షాప్‌ యజమానిపై దాడి

‌Hyderabad:అకారణంగా తనపై దాడి చేశారంటూ చెన్నారెడ్డి ఫిర్యాదు

Update: 2021-10-25 09:52 GMT

Representational Image

‌Hyderabad: రాజేంద్రనగర్‌ మణికొండలో దుండగులు రెచ్చిపోయారు. ఓ మెడికల్‌ షాప్‌ యజమానిపై అకారణంగా దాడికి పాల్పడ్డారు. జ్వరానికి టాబ్లెట్‌ ఇవ్వమని అడిగి, అది ఇస్తుండగా చెన్నారెడ్డిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఈ ఘటనలో యజమాని చెన్నారెడ్డికి తీవ్రగాయాలు కాగా అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News