Quthbullapur: కుత్బుల్లాపూర్‌ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు

*కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫ్లెక్సీలను కత్తిరించిన దుండగులు *హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన మైపాల్‌రెడ్డి వర్గం

Update: 2021-11-08 05:04 GMT

కుత్బుల్లాపూర్‌ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు(ఫోటో- ది హన్స్ ఇండియా)

Quthbullapur: కుత్బుల్లాపూర్‌ కాంగ్రెస్‌లో విబేధాలు భగ్గుమన్నాయి. కొంపల్లిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో రేపు, ఎల్లుండి కాంగ్రెస్‌ శిక్షణ తరగతులు, జనజాగరణ యాత్ర సదస్సు జరగనుంది. ఇందులో భాగంగా సీనియర్‌ నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేరుతో ఆయన అనుచరుడు మైపాల్‌రెడ్డి వర్గం భారీ కటౌట్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. అయితే ఆ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు కత్తిరించి, తొలగించారు. దీంతో ఒక్కసారిగా బాధిత వర్గం ఆందోళనకు గురైంది. ప్రోగ్రామ్‌కు ఒకరోజు ముందు ఫ్లెక్సీలు తొలగించడం హాట్‌టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News