ఆర్టీసీ కార్మికులను సీఎం వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి. దీపావళి నుండి ఆగిపోయిన పీఎఫ్ బకాయిలను వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల పట్ల కేసీఆర్ దయాహృదయంతో ఆలోచించాలని సూచించారు. పాకిస్థాన్ చెరలో ఉన్న ప్రశాంత్ను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.