కాచిగూడలో ఢీ కొన్న రెండు రైళ్లు..!

Update: 2019-11-11 05:50 GMT

హైదరాబాద్‌ కాచిగూడలో ప్యాసింజర్‌- ఎంఎంటీఎస్‌ రైళ్లు ఢీకొన్నాయి. సిగ్నల్ చూసుకోకుండా రెండు రైళ్లు ఒకే ట్రాక్‌ పైకి రావడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, రైలు బోగీలు పక్కకు ఒరిగాయి. దీని కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైల్వే ఉన్నతాధికారులు హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News