హైదరాబాద్ కాచిగూడలో ప్యాసింజర్- ఎంఎంటీఎస్ రైళ్లు ఢీకొన్నాయి. సిగ్నల్ చూసుకోకుండా రెండు రైళ్లు ఒకే ట్రాక్ పైకి రావడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, రైలు బోగీలు పక్కకు ఒరిగాయి. దీని కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైల్వే ఉన్నతాధికారులు హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.