టీఆర్టీ ఎస్జిటీ ఫలితాల విడుదల
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్పిఎస్సి) శనివారం టీఆర్టీ, ఎస్జీటీ (ఇంగ్లీష్ మీడియం) ఫలితాలను విడుదల చేసింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్పిఎస్సి) శనివారం టీఆర్టీ, ఎస్జీటీ (ఇంగ్లీష్ మీడియం) ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 909 పోస్టులకు 843 మంది సభ్యులను ఎంపిక చేసినట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.
ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ (పిహెచ్) కింద ఎంపికైన 39 మంది అభ్యర్థుల ఫలితాలను సర్టిఫికేట్ ధృవీకరణ తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. అలాగే, కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నందున 26 పోస్టుల ఫలితాలను కమిషన్ నిలిపివేసింది. అభ్యర్థులు tspsc.gov.in వెబ్ సైట్ ద్వారా ఫలితాలను చూసుకొవొచ్చు. తెలుగు మీడియంకు సంబంధించిన టీఆర్టీ, ఎస్జిటి ఫలితాలను టిఎస్పిఎస్సి అక్టోబర్ 11 న ప్రకటించింది. ఖాళీగా ఉన్న 3,786 పోస్టులకు గాను సుమారు 3,325 మంది అభ్యర్దులను ఎంపిక చేశారు.