నా తలకు రాయి తగిలి రక్తం కారుతున్న వెనకడుగు వేయాను - తమిళిసై

Tamilisai Soundararajan: గిరిజన ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక అధికారాలున్నాయి - తమిళిసై

Update: 2022-04-18 08:56 GMT

నాతలకు రాయి తగిలి రక్తం కారుతున్న వెనకడుగు వేయాను - తమిళిసై

Tamilisai Soundararajan: ఢిల్లీ(Delhi) లో మీడియాతో గవర్నర్ తమిళిసై(Tamilisai Soundararajan) చిట్‌చాట్ చేశారు. ప్రతి నెల కేంద్రానికి నివేదికలు ఇస్తున్నానని.. నివేదికలపై కేంద్రం ఏమీ చేయాలో అదే చేస్తుందన్నారు తమిళిసై. నివేదిక వివరాలను బయటకు వెల్లడించాలేనన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్న అఖిల భారత సర్వీసు అధికారుల విషయంలో కేంద్రం ఏమీ చేయాలో అదే చేస్తోందన్నారు తమిళిసై.

గిరిజన ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక అధికారాలున్నాయని.. ధాన్యం కొనుగోళ్ల కుంభకోణంకు సీబీఐ(Central Bureau of Investigation) దర్యాప్తు జరిపించాలన్న వినతిని.. సంబంధిత సంస్థకు పంపించానన్నారు. నా తలకు రాయి తగిలి రక్తం కారుతున్న వెనకడుగు వేయానన్నారామె. నెరవేర్చాల్సిన బాధ్యతలను కచ్చితంగా నెరవేరుస్తానన్నారు.

Tags:    

Similar News