Budget 2020 : రైతుల ఆదాయం డబుల్‌ చేస్తామన్నారు.. ఎలా చేస్తారో చెప్పలేదు

Update: 2020-02-01 12:21 GMT

బడ్జెట్ లో తెలంగాణకు న్యాయం జరగలేదని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు విమర్శించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. బడ్జెట్ లో విభజన అంశాలు, ట్రైబల్ మ్యూజియం ప్రస్తావనే లేదని పెదవి విరిచారు.

దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేలా బడ్జెట్ లేదని నామా నాగేశ్వర రావు అభిప్రాయపడ్డారు. రెండేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు..ఎలా చేస్తారో చెప్పలేదని నామా అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ప్రాజెక్టుల మంజూరు, నిధులు కేటాయింపులు చేయకపోవడంపై నామా అసంతృప్తి వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News