Delhi Liquor Scam: బీజేపీ నేతలపై కవిత పరువు నష్టం దావా..!

Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం విధానంలో తనపై నిరాధారణమైన ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరువు నష్టం దావా వేయనున్నారు.

Update: 2022-08-22 10:04 GMT

Delhi Liquor Scam: బీజేపీ నేతలపై కవిత పరువు నష్టం దావా..!

Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం విధానంలో తనపై నిరాధారణమైన ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరువు నష్టం దావా వేయనున్నారు. లిక్కర్‌ మాఫియాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర ఉందని బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ ఆరోపించిన సంగతి తెలిసిందే.. కాగా, బీజేపీ ఆరోపణలపై కవిత పరువు నష్టం దావా వేయడానికి సిద్ధమవుతున్నారు. బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ, మంజిందర్‌పై పరువు నష్టం దావా వేయనున్నట్లు తెలిసింది. ఢిల్లీ మద్యం పాలసీపై నిరాధార ఆరోపణలు చేసినందుకు ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇవ్వాలని కోర్టును కవిత ఆశ్రయించనున్నారు. ఇప్పటికే న్యాయ నిపుణులతో ఆమె చర్చలు జరిపారు.

Tags:    

Similar News