రికార్డు బ్రేక్‌ చేసిన సైదిరెడ్డి

Update: 2019-10-24 08:30 GMT

కాంగ్రెస్ కంచుకోట హుజూర్ నగర్‌ను కారు పార్టీ బద్దలు కొట్టింది. టాప్‌గేర్‌లో దూసుకుపోతున్న కారు వేగానికి కాంగ్రెస్‌ ఖతమైంది. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ బంపర్‌ మెజారిటీ దిశగా దూసుకుపోతుంది. 16వ రౌండ్‌ కౌంటింగ్‌ పూర్తయ్యేసరికి సైదిరెడ్డి 32 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగతున్నారు. ఇప్పటివరకు ఏడు సార్లు జరిగిన హుజూర్‌నగర్‌ నియోజకవర్గ ఫలితాల్లో.. 2009లో 29,194 ఓట్ల అత్యధిక మెజారిటీ నమోదైంది. అయితే తాజాగా సైదిరెడ్డి 15వ రౌండ్‌లోనే ఆ మెజారిటీని అధిగమించాడు. అయితే ఇంకా ఆరు రౌండ్ల కౌంటింగ్‌ మిగిలి ఉండటంతో.. ఆయన మెజారిటీ మరింతగా పెరిగే అవకాశం ఉంది. 

Tags:    

Similar News