టీఆర్ఎస్‌‌కు షాక్‌.. బీజేపీలోకి..

Update: 2020-11-25 10:06 GMT

గ్రేటర్ ఎన్నికలవేళ అధికార పార్టీ టీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. టీఆర్ఎస్ కీలక నేత స్వామిగౌడ్ బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీ వెళ్లిన స్వామిగౌడ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్‌షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు.

బల్దియా ఎన్నికలు ఒకపక్క కాక రేపుతుండగా మరోవైపు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెట్టింది. అసంతృప్త వర్గాన్ని క్యాష్ చేసుకునేందుకు సిద్దమైంది. ఇప్పటికే పలువురు నేతలతో మంతనాలు జరిపిన కమలం నేతలు మరికొందరు నేతలను కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. దీంతో తెలంగాణ పాలిటిక్స్ మరింత ఆసక్తికరంగా మారాయి.

Tags:    

Similar News