కొమురం భీం జిల్లాలో గిరిజనులపై పులి పంజా...!

* ఖానాపూర్ గ్రామానికి చెందిన సిడాం భీమ్‌పై పెద్దపులి హఠాత్తుగా దాడి చేసి హతమార్చింది.

Update: 2022-11-16 10:19 GMT

కొమురం భీం జిల్లాలో గిరిజనులపై పులి పంజా

Komaram Bheem District: కొమురం భీం జిల్లాలో గిరిజనులపై పులి పంజా విసిరిన ఘటన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. నిన్న వాంకిడి మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన సిడాం భీమ్‌పై పెద్దపులి హఠాత్తుగా దాడి చేసి హతమార్చింది. దీంతో గ్రామస్థులు తీవ్ర భయంతో వణికి పోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయంగా ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News