నక్సలైట్ల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్ట్
నక్సలైట్ల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్, జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నక్సలైట్ల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్, జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నూరు క్రాస్ రోడ్ వద్ద వీరిని అరెస్ట్ చేశారు. నిందితులు నకిలీ నక్సలైట్లుగా చెలామణి అవుతూ బలవంతపు వసూళ్ళకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుండి ఒక దేశీయ పిస్తోల్, 8 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని పోలీస్ అధికా రులు వెల్లడించారు.