నిజామాబాద్లో ఆవుల చోరీ ముఠా రెచ్చిపోతోంది. అర్ధరాత్రి పూట ఆవులను ఎత్తుకెళ్లింది. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీసీఎం వ్యాన్లో ఆవులను ఎత్తుకెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. 15 రోజుల వ్యవధిలో రెండోసారి ఆవులను ఎత్తుకెళ్లారు దొంగలు. ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.