HYD News: ఫీజులు కట్టలేదని విద్యార్థులను స్కూల్ బస్లోనే కూర్చోబెట్టిన యాజమాన్యం
HYD News: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ప్రియాంక స్కూల్ నిర్వాకం
HYD News: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ప్రియాంక హై స్కూల్ యాజమాన్యం ఫీజు దోపిడీ మితిమీరుతోంది. ఫీజులు చెల్లించలేదని.. విద్యార్థులపై ప్రతాపం చూపించింది ప్రియాంక హై స్కూల్ యాజమాన్యం. యాచారం మండలంలోని పలు గ్రామాల నుంచి ఉదయం స్కూల్కు వచ్చిన బస్లో కొందరు విద్యార్థులు ఫీజులు కట్టలేదని.. వారిని అలాగే బస్లోనే కూర్చిబెట్టారు సిబ్బంది. స్కూల్ ఆవరణలో పార్కింగ్ చేసిన బస్లో చిన్నారులు అలాగే ఉండిపోయారు. తీవ్ర ఎండలోనూ చిన్నారులు అదే బస్లో అలాగే బిక్కమొటం పెట్టుకున్ని కూర్చున్నారు. ఫీజు చెల్లిస్తామని చెప్పినా వినకుండా విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. విషయం తెలుసుకున్న మీడియా వీడియోలు తీయగా.. విద్యార్థులను తిరిగి తరగతి గదిలోకి తీసుకెళ్లారు. అయితే.. ఫీజుల దోపిడీకి పాల్పడుతూ, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆ పాఠశాలలపై పర్యవేక్షణ కరువైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.