నిజామాబాద్ జిల్లాలో ఇవాళ సుగంధ ద్రవ్యాల బోర్డు తొలి సమావేశం నిర్వహించనుంది. పసుపు రైతులు, వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసింది స్పైసెస్ బోర్డు. పసుపు రైతులు, పంట కొనుగోలుదారులతో పాటు సుగంధ ద్రవ్యాల బోర్డులో మార్కెటింగ్ సంచాలకులు సురేష్కుమార్, మరో ఉన్నతాధికారి రెమా శ్రీ, ఉద్యానశాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో మద్ధతు ధరపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. తేమశాతం ఆధారంగా ధర నిర్ణయించాలంటున్నారు రైతులు.