తెలంగాణా పధకాలను కేంద్రం ఆదర్శంగా తీసుకుంటుంది .. కేటిఆర్

Update: 2019-07-06 02:24 GMT

తెలంగాణా : - తెలంగాణా రాష్ట్రంలో అమలు అవుతున్న పధకాలను కేంద్రం ఆదర్శంగా తీసుకుంటుందని అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఅర్.. ఈ మేరకు అయన ట్వీట్ చేసారు .. మొన్న రైతు బంధు , నేడు మిషన్ భగీరథ పధకాలను కేంద్రం ఆదర్శంగా తీసుకొని దేశం మొత్తం అమలు చేస్తునాయని ఆయన అన్నారు .. దేశానికి కేసీఆర్ దిక్సూచి అని అయన పేర్కొన్నారు .. నిన్న కేంద్ర బడ్జెట్ లో ప్రవేశ పెట్టిన " హర్ ఘర్ జల్" అనే పధకాన్ని తెలంగాణాలో అమలు అవుతున్న మిషన్ భగీరధ పధకాన్ని ఆదర్శంగా తీసుకొనే రూపొందించినదే అని అయన పేర్కొన్నారు .. అలాగే గతంలో మోడీ సర్కార్ ప్రవేశ పెట్టిన పీఎం కిసాన్ పధకం రైతుబందు అనే పధకానికి నమూనానే అని అయన గుర్తు చేసారు ..  



Similar News