నాయిని నర్సింహ రెడ్డి తరహాలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 12 శాతం ఉన్న మాదిగలకు కేబినెట్లో చోటు దక్కలేదన్నారు. మాదిగల గురించి ఎవరో ఒకరు మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. విపక్షాలు మాట్లాడితే రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తారని రాజయ్య వ్యాఖ్యానించారు .