Medak: మెదక్ జిల్లా వెంకటాపురం శివారులో దారుణం.. అనుమానాస్పద స్థితిలో ధర్మా అనే వ్యక్తి మృతి

Medak: మృతుడు భీమ్లా తండాకు చెందిన ధర్మాగా పోలీసుల గుర్తింపు

Update: 2023-01-09 09:48 GMT

Medak: మెదక్ జిల్లా వెంకటాపురం శివారులో దారుణం.. అనుమానాస్పద స్థితిలో ధర్మా అనే వ్యక్తి మృతి

Medak: మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపురం శివారులో అర్థరాత్రి దారుణం జరిగింది. అనుమానాస్పద స్థితిలో కారులో భీమ్లా తండాకు చెందిన ధర్మా అనే వ్యక్తి మృతిచెందాడు. హైదరాబాద్ సెక్రటెరియట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ధర్మా ఈ నెల 5న కుటుంబ సభ్యులతో స్వగ్రామానికి వెళ్లాడు. ఆ తర్వాత కారులో సజీవదహనమయ్యాడు. పూర్తిగా కాలిపోయిన మృతదేహాన్ని చూసిన పోలీసులు ధర్మ ఎలా చని పోయాడు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. కారు వద్ద ఓ బ్యాగ్‌ను పొదల్లో పెట్రోల్‌ డబ్బాను గుర్తించారు. ఆత్మహత్యా, లేదంటే హత్యనా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Tags:    

Similar News