కేజ్రీవాల్కు అభినందనలు తెలిపిన మంత్రి KTR
తాజాగా జరిగిన ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో అమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోయింది. కేంద్రంలో ఉన్న అధికార పార్టీ కూడా అమ్ ఆద్మీ పార్టీకి కనీసం పోటి కూడా ఇవ్వలేకపోయింది.
తాజాగా జరిగిన ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో అమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోయింది. కేంద్రంలో ఉన్న అధికార పార్టీ కూడా అమ్ ఆద్మీ పార్టీకి కనీసం పోటి కూడా ఇవ్వలేకపోయింది. దీంతో ముచ్చటగా మూడో సారి ఢిల్లీ పీఠాన్ని మరోసారి చేజెక్కించుకున్నారు అరవింద్ కేజ్రీవాల్. దీంతో ఆయన ఫిబ్రవరి14న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కు అభినందనలు తెలిపారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 62 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొని వరుసగా మూడోసారి అఖండ విజయాన్ని సాధించింది ఆమ్ ఆద్మీ పార్టీ. దీంతో మూడు సార్లు విజయాన్ని సాధించిన అరవింద్ కేజ్రీవాల్కు దేశ వ్యాప్తంగా ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే కేటీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా చేసుకుని కేజ్రీవాల్కు శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాదు ప్రధాని నరేంద్ర మేడీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీని మరింత అభివృద్ది పథంలో నడిపించాలని సూచించారు.
Many congratulations to Sri @ArvindKejriwal Ji on an impressive hattrick victory 👍
— KTR (@KTRTRS) February 11, 2020