New Ration Cards: మార్చి 1న లక్ష రేషన్ కార్డుల పంపిణీ.. రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు ప్రకటించింది.
Telangana Ration: మీకు రేషన్ కార్డు ఉందా.. అయితే మీకు త్వరలోనే భారీ గుడ్ న్యూస్ చెప్పనున్న తెలంగాణ ప్రభుత్వం
New Ration Cards: తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు ప్రకటించింది. మార్చి ఒకటిన ఒకే రోజు లక్ష కార్డులు జారీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక ఎంతో కాలంగా రేషన్ కార్డుల కోసం అనేక కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. అయితే మార్చి 1 కొన్ని జిల్లాల్లో మాత్రమే రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. మిగతా జిల్లాలకు మార్చి 8 తర్వాత అందించనున్నట్టు రాష్ట్ర పౌరసరఫరా శాఖ అధికారులు తెలిపారు.
ఈ మేరకు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో లక్ష కార్డులను అధికారులు పంపిణీ చేయనున్నారు. కొత్త జిల్లాల ప్రకారం హైదరాబాద్ 285, వికారాబాద్ జిల్లా-22 వేలు, నాగర్ కర్నూల్ జిల్లా 15 వేలు, నారాయణ పేట జిల్లా 12 వేలు, వనపర్తి జిల్లా 6 వేలు, మహబూబ్ నగర్ జిల్లా 13 వేలు, గద్వాల్ జిల్లా 13 వేలు, మేడ్చల్ మల్కాజిగిరి 6 వేలు, రంగారెడ్డి జిల్లా 24 వేలు చొప్పున లక్ష కార్డులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మార్చి 8 తర్వాత అన్ని జిల్లాల్లో పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
2014 నుంచి తెలంగాణలో నూతన రేషన్ కార్డులు జారీ చేయలేదు. ఈ పదేళ్లలో అనేక మంది వివాహాలు చేసుకుని వేరు కాపురాలు పెట్టారు. ప్రభుత్వ పథకాలు ఏమైన అందాలంటే రేషన్ కార్డులు కీలకం. కార్డులు లేకపోవడం వల్ల అనేక మంది సంక్షేమ పథకాలను కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ సమస్యను గుర్తించిన రాష్ట్ర సర్కార్ పేద, మధ్య తరగతి ప్రజలకు నూతన కార్డులు జారీ చేస్తున్నట్టు తీపి కబురు చెప్పింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది జనవరి 26న 16,900 కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరు చేశారు. మరోసారి ఈప్రక్రియ చేపట్టి మరికొన్ని కుటుంబాలకు లబ్ది చేకూర్చేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రజా పాలన, గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించిన అధికారులు.. తాజాగా మీ సేవా కేంద్రాల ద్వారా కూడా అప్లికేషన్లు తీసుకుంటున్నారు. వాటిని పరిశీలించిన అనంతరం అర్హుకు నూతన కార్డులను మంజూరు చేయనున్నారు.
ఇక రాష్ట్రంలో సుమారు 90 లక్షల రేషన్ కార్డులుండగా.. 2.81 కోట్ల మంది లబ్దిదారులున్నారు. కాంగ్రెస్ సర్కారు కొత్త కార్డుల జారీ ప్రక్రియపై కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 లక్షల వరకు కొత్త కార్డులు జారీ అయ్యే అవకాశం ఉంది.