కాసేపట్లో హైకోర్టులో కీలక విచారణలు

Update: 2019-10-29 07:36 GMT

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కాసేపట్లో హైకోర్టులో రెండు కీలక విచారణలు జరగనున్నాయి. సమ్మె విరమించాలంటూ దాఖలైన పిటిషన్లపై వరుసగా రెండో రోజు కూడా కోర్టు వాదనలు విననుంది. ఇదే సమయంలో సకల జనుల సమరభేరి సభకు అనుమతి ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఆర్టీసీ జేఏసీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.

లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన జేఏసీ నేతలు తాము ప్రశాంతంగా సభ నిర్వహించుకుంటామంటూ చెప్పినా పోలీసులు అనుమతి ఇవ్వలేదంటూ కోర్టుకు తెలిపారు. కార్మికులు దాఖలు చేసిన పిటిషన్ కాసేపట్లో విచారించనుంది. 

Tags:    

Similar News