అగ్రిగోల్డ్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ

అగ్రి గోల్డ్ కేసును ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ జరపనుంది.

Update: 2019-08-26 05:14 GMT

అగ్రి గోల్డ్ కేసును ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ జరపనుంది. లక్షలాది మంది బాధితులకు న్యాయం చేసే దిశగా తాము తీసుకుంటున్న నిర్ణయాలకు విఘాతం కలుగుతున్నందున కేసును బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. లక్ష రూపాయల లోపు ఉన్న డిపాజిట్లను తక్షణమే చెల్లించేలా.. నిధులు కేటాయించామని కోర్టుకు వివరించారు. అయితే ఏపీ హైకోర్టుకు కేసు బదిలీ చేయడం వల్ల తమకు ఇబ్బందులు ఎదురువుతాయంటూ పలువురు స్ధానిక బాధితులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణ‍ యించారు. ఈనేపధ్యంలో హైకోర్టు ఎలాంటి నిర్ణ‍యం తీసుకుంటుందోని ఆసక్తి ఇరు రాష్ట్రాల ఖాతాదారుల్లో నెలకొంది. 

 

Tags:    

Similar News