Congress: మధ్యాహ్నం గవర్నర్‌ను కలవనున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు

Congress: రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం తర్వాత కాంగ్రెస్ కృతజ్ఞత సభ

Update: 2023-12-06 06:58 GMT

Congress: మధ్యాహ్నం గవర్నర్‌ను కలవనున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు

Congress: కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్‌ను కలవనున్నారు. రేపటి ప్రమాణస్వీకార కార్యక్రమానికి... ఆహ్వాన పత్రం ఇవ్వనున్నారు. సీఎంతో పాటు ఐదుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అగ్రనేతలను కలిసిన తర్వాత ఎవరెవరు ప్రమాణస్వీకారం చేస్తారనే దానిపై క్లారిటీ రానుంది.

ఇక రేపు తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎల్బీస్టేడియంలో ఏర్పాట్లను సీఎస్, డీజీపీ, సీపీ పరిశీలించారు. రేవంత్‌ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలు హాజరుకానున్నారు. రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం తర్వాత కాంగ్రెస్ కృతజ్ఞత సభ ఏర్పాటు చేయనుంది.

Tags:    

Similar News