Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశం
Telangana Congress: తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఇవాళ గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనున్నది.
Telangana Congress: తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఇవాళ గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనున్నది. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ర్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్ హాజరుకానున్నారు. పార్టీ సంస్తాగత నిర్మాణం, స్థానిక ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజాపాలన విజయోత్సవ సంబరాలపై సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. కొత్తగా ఎన్నికైన జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులతో పాటు.. ఇప్పటి వరకు ఆ పదవుల్లో కొనసాగిన నాయకులు సమావేశంలో పాల్గొననున్నారు. కొత్తగా డీసీసీ బాధ్యతలు చేపట్టిన నేతలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియామక పత్రాలు అందయేచనున్నారు. పదవీ కాలం పూర్తి చేసుకున్న డిసీసీ అధ్యక్షులను ఈ సందర్భంగా సన్మానించనున్నారు.