రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ సీరియస్ అయ్యింది. రేవంత్ వ్యాఖ్యలు తీవ్రంగా ఉన్నాయంటోన్న కమిటీ ఏం చేయాలన్నదానిపై ఏఐసీసీని సంప్రదించాలని ఆలోచిస్తోంది. అయితే, అసెంబ్లీలో ఎప్పుడు ఏ అంశం మాట్లాడాలో సీఎల్పీ నేతకు తెలుసన్న క్రమశిక్షణా కమిటీ సీఎల్పీ కృషితోనే పార్టీ గ్రాఫ్ పెరిగిందని అభిప్రాయపడింది. కానీ రేవంత్ వ్యాఖ్యలతో భట్టి శ్రమ వృథా అయ్యే పరిస్థితి వచ్చిందని కమిటీ వ్యాఖ్యానించింది.