కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్లు : సీఎం కేసీఆర్

చైనా సైనికులు జరిపిన దాడిలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారు.

Update: 2020-06-19 13:57 GMT

చైనా సైనికులు జరిపిన దాడిలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల భారీ సహాయం ప్రకటించారు. అంతేకాకుండా సంతోష్ బాబు కుటుంబానికి నివాస స్థలం తోపాటు, సంతోష్ బాబు భార్యకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు.

తానే స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి ఈ సాయాన్ని అందించనున్నట్టు స్పష్టం చేశారు. అలాగే చైనా ఘర్షణలో అమరులైన మరో 19 మంది కుటుంబాలకు కూడా సాయం అందించనున్నట్టు తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల మేర ఆర్ధిక సాయం చేయనున్నట్టు వెల్లడించారు. ఈ సహాయాన్ని కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందిస్తామని తెలిపారు. మిగతా ఖర్చులను తగ్గించైనా సైనికుల సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు. 


Tags:    

Similar News