పశు వైద్యురాలి ఘటనపై సీఎం స్పందించకపోవడం విచారకరం : లక్ష్మణ్

శంషాబాద్ లో జరిగిన వెటర్నరీ వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్యాచారం ఘటనపై అన్ని పార్టీల నాయకులు స్పందించారు.

Update: 2019-12-01 07:09 GMT
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్

శంషాబాద్ లో జరిగిన వెటర్నరీ వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్యాచారం ఘటనపై అన్ని పార్టీల నాయకులు స్పందిచారని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకూ ఎందుకు స్పందించలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయికూడా ఇంతటి విషాదకర సంఘటనపై స్పందించకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.

ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ కార్యాలయం నిర్మించడానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణలో శాంతిభద్రతలు కొరవడ్డాయని ఆయన తెలిపారు. విద్యాబుద్దులు నేర్పే పాఠశాలలు మూసివేస్తున్నారని, వైన్ షాపులు, బారులు మాత్రం తెరుస్తున్నారని లక్ష్మణ్ ప్రభుత్వాన్ని విమర్శించారు.  

Tags:    

Similar News