మున్సిపల్ ప్రాంతాల్లో నిరుపేదలకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వరాలు ప్రకటించారు. 75 గజాల లోపు ఇంటి నిర్మాణానికి రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం రూపాయి మాత్రమే ఉంటుందని.. జీ ప్లస్ 1 వరకు రూపాయితో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. మున్సిపల్ చట్టాన్ని పూర్తి పారదర్శకంగా రూపొందించామన్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇకపై ఆన్లైన్లోనే పర్మిషన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.ఇళ్ల యజమానులు ఇకపై సెల్ఫ్ అసెస్మెంట్తో ఇంటి పన్ను కట్టే వెసలుబాటు కల్పిస్తున్నామని కూడా తెలిపారు.