ఆరునూరైన సచివాలయం నిర్మిస్తాం: తలసాని

Update: 2019-07-01 10:21 GMT

కాంగ్రెస్ నేతలు టైంపాస్ కోసమే సెక్రటేరియట్ కు వచ్చారని విమర్శించారు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. విహారయాత్రకు వచ్చినట్టు వచ్చి ఫోటోలు దిగారన్నారు. ఎవరెన్ని చెప్పినా ఆరునూరైన సచివాలయ నిర్మాణం చేపట్టితీరుతామన్నారు తలసాని. అధికారంలో ఉన్నంతకాలం ప్రజా సమస్యలు ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టని కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఎందుకు విమర్శిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. అసెంబ్లీ, సచివాలయ నూతన భవనాలు ప్రభుత్వానికి సంబంధించినవే తప్ప సీఎం కేసీఆర్‌కు సంబంధించినవి కాదన్నారు. అది కూడా కాంగ్రెస్‌ నేతలకు తెలియదా? అని మంత్రి దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ నేతల గైడెన్స్‌ తీసుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు చూడలేకనే ఆ పార్టీని ఎమ్మెల్యేలు వదిలి వెళ్లారన్నారు.

Full View 

Tags:    

Similar News