రెడ్ జోన్ గా వేములవాడ సుభాష్ నగర్

వేములవాడలో సుభాష్ నగర్ నుంచి ఒక కిలోమీటరు కంటైన్మెంట్ ఏరియా నిషేధిత ప్రాంతం.

Update: 2020-04-10 17:41 GMT

వేములవాడలో సుభాష్ నగర్ నుంచి ఒక కిలోమీటరు కంటైన్మెంట్ ఏరియా నిషేధిత ప్రాంతం.ఈ ప్రాంతంలోకి బయటి వారికి ప్రవేశం ఉండదు. వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ కు చెందిన యువకునికి, కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో, ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా అధికారులు ప్రకటించారు.

ఈప్రాంతం నుంచి ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ ఏరియా గా ప్రకటించారు. ఇది నిషేధిత ప్రాంతంగా అధికారులు పరిగణిస్తూ..ఈ ప్రాంతంలోకి బయటి వ్యక్తులకు ప్రవేశాన్ని నిషేధించారు. వేములవాడ పట్టణంలో 25 వేల 433 వందల జనాభా ఉండగా, శుక్రవారం 6272 కుటుంబాలను వైద్య ఆరోగ్య సిబ్బంది కలిసి వారి ఆరోగ్య సమాచారాన్ని సేకరించింది.

Tags:    

Similar News