Srisailam: శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డ్ సమావేశం.. క్యూ కంపార్ట్మెంట్ల కోసం రూ. 75 కోట్లు విడుదల
Srisailam: అలానే క్షేత్రంలో పలుచోట్ల ఆగిన ఫ్లోరింగ్ పనులను చేయాలని నిర్ణయించమన్నారు
Srisailam: శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డ్ సమావేశం.. క్యూ కంపార్ట్మెంట్ల కోసం రూ. 75 కోట్లు విడుదల
Srisailam: శ్రీశైలం దేవస్థానంలో ఆలయ ట్రస్ట్ బోర్డ్ సమావేశంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పాల్గొన్నారు. 19 ప్రతిపాదనలకు.... 18 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఆలయ నూతన క్యూ కంపార్ట్మెంట్ల కోసం 75 కోట్ల రూపాయలు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలోనే టెండర్లకు పిలుస్తామన్నారు. అలానే క్షేత్రంలో పలుచోట్ల ఆగిన ఫ్లోరింగ్ పనులను చేయాలని నిర్ణయించమన్నారు. క్షేత్ర పరిధిలో విద్యుత్ సదుపాయం కోసం 20 లక్షలకు ఆమోదం తెలిపామని... నెల్లూరు రాజ్యసభ సభ్యుడు వేమూరి ప్రభాకర్ రెడ్డి దేవస్థానానికి విరాళంగా ఇవ్వనున్న బంగారు రథానికి 40 లక్షలతో నూతన బిల్డింగ్ ఏర్పాటుకు ఆమోదించామన్నారు.