తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాసేపు సరదాగా గడిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక సంగమేశ్వర కాలనీలో పిల్లలతో కలిసి కొద్ది సేపు గోలీలాట ఆడారు. అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ దృశ్యాలను చూసేందుకు స్థానికులు క్యూ కట్టారు.